Thursday, April 18, 2024

కేసీఆర్ త్యాగనిరతి వల్లే తెలంగాణ – ఎంపీ రంజిత్ రెడ్డి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ .. ‘తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదంతో నవంబర్ 29, 2009 న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నే చరిత్ర గతిని మార్చిందని చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా.జి రంజిత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఈ దీక్షా దివస్ స్ఫూర్తిగా నిలిచిందన్నారు.

ఈ రోజు కి దీక్షా దివస్ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా.. అప్పటి ఉద్యమ జ్ఞాపకాలు గుర్తుకు వస్తే కళ్ళకు నీళ్ళు వస్తాయని అన్నారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను గుర్తు చేసుకొని వారికి ఘన నివాళులు అర్పిస్తున్నానన్నారు. దీక్షా దివస్ స్పూర్తితో అద్భుతమైన ప్రజా సంక్షేమ పథకాలతో బంగారు తెలంగాణ సాధన దిశగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement