Friday, April 26, 2024

Breaking : ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ భూష‌న్ హెల్త్ బులెటిన్ వివ‌రాలు ..

ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ భూష‌న్ హెల్త్ బులెటిన్ వైద్యులు రిలీజ్ చేశారు. క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్ బిశ్వ భూష‌న్ గ్యాస్ట్రిక్ స‌మ‌స్య‌తో తిరిగి ఆసుప‌త్రిలో చేరారు. క్లినిక‌ల్ పార‌మిట‌ర్స్ అన్ని స్టేబుల్ గా ఉన్నాయి. తేలిక‌పాటి విరేచ‌నాలు, ర‌క్త హీన‌త ల‌క్ష‌ణాలు ఉన్నాయని తెలిపారు ఏఐజీ ఆస్ప‌త్రి వైద్యులు. క‌రోనా బారినపడి కోలుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరోమారు అస్వస్థతకు గురయ్యారు. దీంతో గత రాత్రి ఆయనను హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement