Sunday, May 19, 2024

Breaking : ఐఐటీ మ‌ద్రాస్ క్యాంప‌స్ లో – కొత్త‌గా 32క‌రోనా కేసులు

ఐఐటీ మ‌ద్రాస్ క్యాంప‌స్ లో వ‌రుస‌గా క‌రోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మద్రాస్ ఐఐటీ లో కొత్తగా 32 మందికి పరీక్షలు చేయగా.. కోవిడ్ పాజిటివ్ గా తేలింది. దీంతో మొత్తం క్యాంపస్ లో కేసుల సంఖ్య 111కి చేరుకుందని అధికారులు వెల్లడించారు. క్యాంపస్ లోని వివిధ హాస్టళ్లలోని కరోనా సోకిన విద్యార్థులను ఆ రాష్ట్ర హెల్త్ సెక్రటరీ జే రాధాకృష్ణన్ పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. తమిళనాడు వ్యాప్తంగా సోమవారం 55 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 34,53,607 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement