Monday, May 6, 2024

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి

యాదాద్రి :యదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి, లక్ష్మీదేవి గూడెం, జంపల్లి రాముని గుండాల తండా, పెద్ద పలుకు తండా, ఎర్ర బెట్టు తండ, అన్నంపట్ల గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యాన్ని కొనుగోలుకు సహకరించకపోయినా, సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత నష్టమైనా భరించి ఈ యాసంగిలో పండిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసి ముడి బియ్యాన్ని కేంద్రానికి పంపిస్తుందని తెలియచేశారు. రైతు తమ ధాన్యాన్ని కల్లాల్లోనే ఆరబెట్టుకుని కేంద్రానికి తేవాలని, అకాల వర్షాలు పడే ఉన్నందున ధాన్యపు రాశులపై పట్టాలు కప్పుకొని జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement