Monday, May 6, 2024

టీఆర్ఎస్ లో భారీగా చేరికలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లోకి వలసలు వస్తున్నారని జనగామ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. మంగళవారం జనగామ జిల్లా నర్మెట్ట మండలకేంద్రంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షులు చింతకింది సురేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సమక్షంలో పలువురికి కండువా కప్పి వారిని టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అటు రైతులను, దేశంలోని నిరుద్యోగులను మోసం చేస్తోందన్నారు. అన్ని ప్రభుత్వ సంస్థలను అమ్ముకుంటూ, మత కలహాలు సృష్టిస్తూ దేశాన్ని అభివృద్ధికి దూరం చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కేవలం కేసీఆర్ సారథ్యంలోని సాధ్యమన్నారు. కేంద్రం వడ్లు కొనేది లేదని చెప్పిన కేసీఆర్  రైతుల కష్టాలు తెలిసిన రైతు బిడ్డగా యాసంగి పంటను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement