Sunday, May 19, 2024

HYD: జలమండలి కార్యాలయం వద్ద ఉద్రిక్త‌త

హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఖైరతాబాద్ జల మండలి కార్యాలయం వద్ద ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. నగరంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు జలమండలి కార్యాలయాన్ని ముట్టడించారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, సిటీ ప్రెసిడెంట్, కార్పొరేటర్లు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమానికి బీజేపీ శ్రేణులు భారీగా తరలివస్తున్నాయి. నగరంలో నీటి సమస్య, డ్రైనేజి పనుల నిర్లక్ష్యం, నీటి కాలుష్యంపై పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఈ ఆందోళ‌న‌తో అక్క‌డ ఉద్రిక్త‌త నెల‌కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement