Saturday, April 27, 2024

పశ్చిమబెంగాల్‌లో బాంబు పేలుడు… ముగ్గురు మృతి

ఓ ఇంట్లో బాంబు పేల‌డంతో ముగ్గురు మృతిచెందిన విషాద ఘ‌ట‌న పశ్చిమబెంగాల్‌లో చోటు చేసుకుంది. తూర్పు మేదినీపూర్‌లోని భూపతినగర్‌లో గల తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ)కి చెందిన బూత్‌ ప్రెసిడెంట్ రాజ్‌కుమార్‌ మన్న ఇంట్లో బాంబు పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో రాజ్‌ కుమార్‌తోపాటు మరో ఇద్దరు మృతిచెందారు.

మరి కొంతమందికి తీవ్ర గాయాలైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు. టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఈరోజు ఆ ప్రాంతంలో సభ నిర్వహించనున్న తరుణంలో బాంబు పేలుడు సంభవించడం స్థానికంగా కలకలం రేపింది. టీఎంసీ నేతలు రాజ్‌కుమార్ మన్నా ఇంట్లో భేటీ అయిన సమయంలో దుండగులు బాంబు పేల్చినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement