Saturday, April 27, 2024

స్టార్ హీరోస్ తో – బాలీవుడ్ నిర్మాత బోనీక‌పూర్ ప్రాజెక్ట్స్

బాలీవుడ్ నిర్మాత బోనీక‌పూర్ వ‌రుస సినిమాల‌ని లైన్ లో పెట్టారు. కాగా త‌మిళ స్టార్ హీరో అజిత్ న‌టించిన వ‌లిమై చిత్రం రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని హెచ్. వినోద్ తెర‌కెక్కించాడు. ఈ చిత్రం తమిళ .. తెలుగు .. హిందీ భాషల్లో సంక్రాంతికి విడుదల కావలసింది. అయితే ఈ సినిమా కరోనా తీవ్రత కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఈ నెల 24వ తేదీన ఆయన థియేటర్స్ లో దింపుతున్నారు. కార్తికేయ విలన్ గా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ తరువాత బోనీ కపూర్ నాలుగు సినిమాలను లైన్లో పెట్టారు .. వాటిలో ఒకటిగా ‘మైదాన్’ కనిపిస్తుంది. అజయ్ దేవగణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా ఫుట్ బాల్ క్రీడకి మరింత పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టిన సయ్యద్ అబ్దుల్ రహీద్ జీవితచరిత్రగా ఈ సినిమా రూపొందుతోంది. ఆత్మవిశ్వాసానికి మించిన ఆయుధం లేదనే చెప్పే కథ ఇది. ఈ సినిమాలో ప్రియమణి ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.

మైదాన్ సినిమాను హిందీతో పాటు తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో జూన్ 3వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక మరో వైపున ‘మిళి’ పనులు కూడా చురుకుగా జరుగుతున్నాయి. జేవీఆర్ మాతుకుట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ .. సన్నీ కౌశల్ నాయకా నాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి కూడా ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక తమిళంలో ఉదయనిధి స్టాలిన్ – తాన్య రవిచంద్ర జంటగా ‘నెంజుకు నీధి’ .. ఆర్.జె. బాలాజీ – అపర్ణ బాలమురళి జంటగా ‘వీటిలా విషేషంగా’ కూడా రెడీ అవుతున్నాయి. అజిత్ తోనే మరో సినిమాను చేయడానికి బోనీ కపూర్ సన్నాహాలు చేస్తున్నారు. మార్చి నుంచి ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఇలా వ‌రుస ప్రాజెక్టుల‌తో బోనీ క‌పూర్ బిజి బిజీగా ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement