Tuesday, May 7, 2024

క‌రోనా నుండి కోలుకున్న మెగాస్టార్ – షూటింగ్ సెట్ లో చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవికి రెండోసారి కూడా క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. దాంతో ఆయ‌న హోం ఐసొలేట్ అయ్యారు. కాగా రీసెంట్ గా చిరంజీవి క‌రోనా నుండి కోలుకున్నారు. దాంతో షూటింగ్ లో పాల్గొన్నారాయ‌న‌. గాడ్ ఫాద‌ర్ షూటింగ్ సెట్స్ లో ఉన్న ఫొటోల‌ని చిరంజీవి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. చిరంజీవి షేర్ చేసిన ఫోటోలలో నటుడు సునీల్, బ్రహ్మాజీ, సత్య దేవ్ తో పాటు దర్శకులు మోహన్ రాజా, మెహర్ రమేష్ కూడా ఉన్నారు. ఇక ఏదో పెళ్లి వేడుకకు సంబంధించిన షూట్ జరుగుతున్నట్లు సదరు ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది.

చిరంజీవి వరుసగా చిత్రాలు ప్రకటించిన విషయం తెలిసిందే. దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య )సమ్మర్ కానుకగా విడుదల కానుంది . దాదాపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి అయ్యాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ మూవీ పలుమార్లు వాయిదా పడింది. ఫిబ్రవరి 4 నుండి ఏప్రిల్ 1కి షిఫ్ట్ అయిన ఆచార్య… మరలా ఏప్రిల్ 29న ఫైనల్ విడుదల తేదీగా ప్రకటించారు. అలాగే దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న భోళా శంకర్ సెట్స్ పైన ఉంది. ఇది తమిళ చిత్రం వేదాళం రీమేక్ అని సమాచారం. ఈ చిత్రం కంటే ముందు మలయాళ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న గాడ్ ఫాదర్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. అలాగే దర్శకుడు బాబీతో ఒక మూవీ ప్రకటించారు చిరంజీవి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement