Saturday, September 21, 2024

ఆధిపత్య ధోరణి ఎక్కడుంది?: పవన్ కు సజ్జల కౌంటర్

ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధి కనపరచకుండా ఆధిపత్య ధోరణిలో వెళ్లింద‌న్న జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్యలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఉద్యోగుల ఆవేదన గుర్తించామని ఆయన అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సీఎం జగన్ డేర్ చేశారన్నారు. ఆధిపత్య ధోరణి ఎక్కడుందో పవన్ కల్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ ఆలోచనల చేసివుంటే విజయవాడ వంటి కార్యక్రమం జరిగేదా అని ఫ్రశ్నించారు. తక్కువ సమయంలో సమస్య పరిష్కారమైందన్నారు. ఫిట్ మెంట్ పెంచాలని టీచర్ల సంఘాలు కోరాయన్న సజ్జల.. ఆర్థిక ఇబ్బందితో పెంచే పరస్థితి లేదని చెప్పామన్నారు. అన్ని విషయాలపై చర్చల్లో అంగీకరించారని తెలిపారు. బయటకెళ్లి మళ్లీ ఆందోళన అంటున్నారని అన్నారు. ఒప్పందం అయ్యాక బయటకెళ్లి మాట్లాడడం సరికాదన్నారు. ఇంతకంటే ఎక్కువ చేసే పరిస్థితి ప్రస్తుతం లేదన్నారు. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చిన పోస్టులు పెట్టడం సరికాదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement