Monday, April 15, 2024

Breaking: రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి వెళ్లనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రానికి సీఎం వెళ్లనున్నారు. ముగింపు దశలో ఉన్న ఆలయ పునర్నిర్మాణ పనుల పరిశీలించనున్నారు. ఆలయ పున: సంప్రోక్షణ కోసం నిర్వహించనున్న సుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లపై చర్చించనున్నారు.

మార్చి 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వారం రోజుల పాటు అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పున: ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులు, పీఠాధిపతులు యోగులు, స్వామీజీలు, కోట్లాదిగా తరలివచ్చే జనం కోసం కల్పించే సౌకర్యాలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement