Friday, April 26, 2024

కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకున్న బీజేవైఎం

కార్యకర్తలు అడ్డుకున్నారు. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ కోసం వారం రోజులుగా యువమోర్చా నాయకులు  నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మీదుగా వెళుతున్న మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ని బీజేవైఎం కార్యకర్తలు ఆపడానికి యత్నించారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు కార్యకర్తలను అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. ఒక్కసారిగా నిరసనకారులు కాన్వాయ్‌కు అడ్డంగా రావడంతో మంత్రి కేటీఆర్ అవాక్కయ్యారు.

కాగా, గతంలో నారాయణపేట జిల్లా పర్యటన సందర్భంగా కూడా ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకుని నిరసన తెలిపిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement