Saturday, April 20, 2024

కేంద్రం అఫిడవిట్‌‌ను నిరసిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్యోగుల ఆందోళన

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టులో కౌంట‌ర్ అఫిడ‌విట్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోందని కేంద్ర ప్ర‌భుత్వం వివ‌రించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్ ఈ మేర‌కు నిర్ణయం తీసుకుందని, స్టీల్‌ప్లాంట్‌ను 100 శాతం ప్రైవేటీకరణ చేస్తామని అఫిడవిట్‌లో చెప్పింది. దీంతో కేంద్ర స‌ర్కారు దాఖ‌లు చేసిన‌ అఫిడివిట్‌ పై స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ వద్ద గురువారం ఉద‌యం ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఉద్యోగులు పరిపాలన భవనం వద్దకు చేరుకోవ‌డంతో అక్క‌డ‌ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విధులకు వెళుతున్న ఇత‌ర‌ కార్మికులను ఉద్యోగస్తులు అడ్డుకుంటున్నారు. దీంతో అక్క‌డ పోలీసులు బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటోన్న నిర్ణ‌యాల‌పై స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: థియేటర్ల వ్యవస్థపై ఆర్.నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు

Advertisement

తాజా వార్తలు

Advertisement