Saturday, April 27, 2024

గులాబీ గూటికి పెద్దిరెడ్డి… టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటన!

బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమైయ్యారు.  ఈ నెల 30న సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరతానని పెద్దిరెడ్డి ప్రకటించారు. బీజేపీలో ఉన్న వ్యవస్థ తనకు నచ్చలేదని, అందుకే బయటకు వచ్చేశానని తెలిపారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించటమే లక్ష్యమని చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీచేయమని కేసీఆర్ ఆదేశిస్తే పోటీచేస్తానన్నారు. టీఆర్ఎస్‌లోకి రావాలని సీఎం కేసీఆర్ ఆహ్వానించారని చెప్పారు. 30వ తేదీన టీఆర్ఎస్ పార్టీలో చేరతానని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ఏ పదవి ఆశించి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరటంలేదన్నారు. కేసీఆర్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు పేదలకు అందించటానికి వారిధిలా ఉంటాననన్నారు. దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి హామీపై కేసీఆర్ నిర్ణయాలకు ప్రజలే ఆమోదం తెలుపుతున్నారని తెలిపారు. దళితబంధు పథకం హుజూరాబాద్ నుంచి ప్రారంభించటం సంతోషం కలిగించిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement