Thursday, April 25, 2024

ఆంధ్రుల ఆకాంక్షలను నెరవేర్చండిః కేంద్ర మంత్రి నిర్మలాకు వైసీపీ విజ్ఞప్తి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను వైఎస్సార్‌సీపీ ఎంపీలు కలిశారు. పోలవరం, ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రితో వైఎస్సార్‌సీపీ ఎంపీల బృందం చర్చించింది. ఏపీ ఖర్చు చేసిన మొత్తాన్ని తక్షణమే రీయింబర్స్‌మెంట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ‘‘2013 భూసేకరణ చట్టం ప్రకారం సహాయ, పునరావాస ప్యాకేజీ అమలు చేయాలి. 2022 కల్లా పోలవరం పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. నిధులు ఆలస్యమైతే పోలవరం వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని’’ కేంద్ర ఆర్థిక మంత్రికి సమర్పించిన లేఖలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement