Saturday, April 27, 2024

కేర‌ళ‌లో బ‌ర్డ్ ఫ్లూ విజృంభ‌న‌.. ఎనిమిది వేల ప‌క్షుల‌ను చంప‌నున్న అధికారులు

కోళ్లు..బాతులు..ఇత‌ర పెంపుడు ప‌క్షుల‌ను చంపాల‌ని కేర‌ళ స‌ర్కార్ ఆదేశాలు జారీ చేసింది.కాగా కేర‌ళ‌లో బ‌ర్డ్ ప్లూ పంజా విసిరింది.బర్డ్ ఫ్లూ సోకిన పక్షులను తినడం వల్ల జబ్బు మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వలస పక్షులు, సముద్ర పక్షుల ద్వారా బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుంది. ప్రభావిత ప్రాంతాల నుంచి కిలోమీటర్ దూరం వరకు పరిధిలో ఉన్న కోళ్లు, బాతులు, ఇతర పెంపుడు పక్షులు చంపాలని ప్రభుత్వం ఆదేశించింది.

దీంతో, దాదాపు 8 వేల వరకు పక్షులకు అధికారులు చంపేయనున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని, క్రిమిసంహారక మందులను చల్లాలని స్థానిక సంస్థలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పోలీసులు, రెవెన్యూ, జంతు సంరక్షణ శాఖ, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో రక్షణ చర్యల్లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు. ప్ర‌భావిత ప్రాంతాల నుంచి కోళ్లు, బాతులు, మాంసం అమ్మకాలు, ఎగుమతులు, దిగుమతులపై నిషేధం విధించారు. చనిపోయిన పక్షుల నమూనాలను భోపాల్ లోని నేషనల్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్ కు పరీక్షల నిమిత్తం పంపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement