Thursday, March 28, 2024

గుహలో చిక్కుకున్న యువకుడి కోసం.. కొనసాగుతున్న రెస్క్యూ..

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా సింగరాయపల్లి అటవీ ప్రాంతంలో వేటగాడు రాజు గుహలో చిక్కుకున్నాడు. వేట కోసం అడవికి వెళ్లిన రాజు సెల్ ఫోన్ జారిపోవడంతో రాళ్ల మధ్యకు దూరి ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. ఆ యువకుడిని బయటకు తీసేందుకు రెస్క్యూ కొనసాగుతోంది. దాదాపు 36 గంటలుగా కొండరాళ్ల మధ్యలో రాజు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. సమాచారం అందుకున్న అధికారులు నాలుగు జేసీబీలతో కొండరాళ్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. స్టోన్ క్రషర్ తో రాళ్లను పగులగొడుతున్నారు. ఈ క్రమంలో రాజుకు ఓఆర్ఎస్, మంచినీళ్లను అధికారులు అందిస్తున్నారు. అయితే రాజుకు ప్రాణాపాయం ఏం లేదని పోలీసులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement