Saturday, April 27, 2024

Peoples March: వెలుగొండ స్వామికి ప్రత్యేక పూజలు.. భట్టి పాదయాత్ర ప్రారంభం

ప్రజా సమస్యల పరిష్కారం కొరకై తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర) ను పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శుక్రవారం ముదిగొండ మండలం అమ్మపేట గ్రామంలోని శ్రీ వెలుగొండ స్వామి దేవాలయంలో బట్టి విక్రమార్క దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ నిర్వాహకులు పూలమాల వేసి శాలువాతో సత్కరించారు. అనంతరం గ్రామంలో పెద్ద ఎత్తున పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులతో పాదయాత్ర కొనసాగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement