Saturday, April 27, 2024

ట్రాఫిక్ క‌ష్టాలు.. మెట్రోలో పెళ్లి కూతురు.. అవాక్క‌యిన ప్ర‌యాణికులు

ట్రాఫిక్ ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండ‌టంతో ముహూర్తం స‌మ‌యానికి క‌ల్యాణ మండ‌పానికి చేరుకోలేన‌ని భావించిన పెళ్లి కూతురు మెట్రో రైలు ఎక్కింది.ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించి రైలెక్కిన ఆమెను చూసిన ప్రయాణికులు నోరెళ్లబెట్టారు. ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడేందుకు యువతి సమయస్ఫూర్తిగా ఆలోచించిందటూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. ‘స్మార్ట్ పెళ్లికూతురు’ అంటూ కామెంట్ చేస్తున్నారు. కొందరు ఆమెను ప్రశంసిస్తుంటే మరికొందరు మాత్రం ముహూర్తం సమయానికే బయలుదేరడం ఏంటని, సమయపాలన అస్సలు లేదని ఆమెను విమర్శిస్తున్నారు. కల్యాణ మండపానికి చేరుకుని, పెళ్లి పీటలపై కూర్చోవడం కూడా ఆ వీడియోలో కనిపించింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉండడంతో ముహూర్తం సమయానికి కల్యాణ మండపానికి చేరుకోలేనని భావించిన వధువు పెళ్లి కూతురు ముస్తాబులోనే మెట్రో ఎక్కేసింది. ఈ సంఘ‌ట‌న బెంగ‌ళూరులో చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement