Tuesday, May 7, 2024

Awareness – అల‌సిన గుండెకు చికిత్స్ – పాఠ్యాంశంగా సిపిఆర్….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: చిన్నతనంలోనే గుండెపోటుకు గురై చనిపోతున్న వారి సంఖ్య పెరిగి పోతుండడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. మూడు, నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు సైతం అకస్మాత్తుగా కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తు న్నాయి. క్రికెట్‌ ఆడుతూ ఛాతి నొప్పికి గురై అపస్మారక స్థితికిలోనై అక్కడి కక్కడే ప్రాణాలు వదులుతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. పాఠశాలలు, హాస్టళ్లలో జరుగుతున్న కార్డియో అరెస్ట్‌ సంఘటనలు జరిగితే వెంటనే అప్రమత్తమై విద్యార్థుల ప్రాణాలను అరికట్టి కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. విద్యార్థులందరికీ విధిగా కార్డియో పల్మునరీ రిసొసి టీషన్‌ (సీపీఆర్‌) శిక్షణ ఇవ్వాలని ప్రతిపాదించింది. సీపీఆర్‌ అని పిలిచే ఈ ప్రక్రియ కార్డియాక్‌ అరెస్ట్‌ జరిగిన సమయంలో అప్రమత్తమై గుండెపై భాగాన్ని అదిమిపట్టి మసాజ్‌ చేస్తే సగం మందిని ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చని బయట ఇటీవల జరిగిన సంఘటనలను బట్టి తెలుస్తోంది. గుండె నుంచి రక్తం సరఫరా చేసే రక్త నాళాలు ముసుకు పోవడం(బ్లాక్‌ కావడం) వల్ల వచ్చేదే కార్డియాక్‌ అరెస్ట్‌ అని వైద్యులు చెబుతున్నారు. రక్త నాళాలు మూసుకుపోవడంతో వచ్చే గుండెపోటు నుంచి తప్పించేందుకు సీపీఆర్‌ ఎంతో ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు. సీపీఆర్‌ చేయడం వల్ల రక్తం సరఫరా వేగవంతమై బ్లాకులు క్లియర్‌ అవడం వల్ల జనాలు బతికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గుండె సంబంధిత వైద్యులు చెబుతున్నారు.

సీపీఆర్‌ చేయడం తెలియక పోవడంతోనే మరణాలు
ఇటీవల చోటుచేసుకుంటున్న మరణాల్లో సగం కంటే ఎక్కువ కార్డియాక్‌ అరెస్ట్‌తోనే జరుగుతున్నాయి. కార్డియాక్‌ అరెస్ట్‌ జరిగినపుడు అందుబాటులో ఉన్నవారికి సీపీఆర్‌ చేయడం తప్పనిసరి. అయితే సీపీఆర్‌ చేయడం తెలియకపోవడం, దగ్గరలో ఆస్పత్రులు లేకపోవడం వల్లనే ఎక్కువ మంది చనిపోతున్నారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. గుండెపోటు వచ్చిన సమయంలో ఆ మనిషి పక్కన లేదా దగ్గర్లో ఉండేవారిలో ఏ ఒక్కరికైనా సీపీఆర్‌ గురించి అవగా హన ఉంటే ప్రాణాన్ని కాపాడిన వాళ్లవుతారని చెబుతున్నారు. ఇందుకోసమే తెలంగాణ ప్రభుత్వం త్వరలో అన్ని పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సీపీఆర్‌ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఏదో కొద్ది రోజులు మొక్కుబడిగా కాకుండా ప్రతి తరగతి సిలబస్‌లో ప్రాథమిక వైద్యం అని సబ్జెక్ట్‌ పెట్టి పూర్తిస్థాయిలో వారికి వైద్యంపై అవగా హన కలిగించాలని ఇటు పాఠశాల విద్యా శాఖ వైద్యశాఖలు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఇంటర్నేషనల్‌ పాఠశాలల్లో వారానికి రెండు మూడు రోజులు ఒక పీరియడ్‌ సీపీఆర్‌ శిక్షణ కోసం కేటాయించాలని భావిస్తున్నట్టు సమాచారం.

కేవలం సీపీఆర్‌ మాత్రమే కాకుండా అత్యవసర సమయాల్లో విద్యార్థులు ఎటువంటి అనారోగ్యానికి గురైనా ఇంకా ఇతర సమస్యలకు లోనైనా అత్యవసర వైద్యం అందించి ప్రాణాలు కాపాడుకునే తరగతి గదిలో బోధించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఉదా హరణకు విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి గురైతే రోడ్డు పక్కన ఉండే వారు ఎటువంటి సహాయం అందించాలి. కాలు లేదా చేయి విరిగితే రక్తం స్త్రావం జరగకుండా ఎలా ఆపాలి. ఇంట్లో ఎవరికైనా అత్యవసర వైద్య సహాయం అవసరమైతే ఎవరికి ఫోన్‌ చేయాలి? ఇలాంటివన్నీ పాఠశాల గదిలో అందించాలని విద్యాశాఖ ప్రతిపాదించినట్టు చెబుతున్నారు. వాస్తవానికి కేవలం విద్యార్థులకే కాకుండా ప్రతి పౌరునికి ఇవన్నీ అవసరమని దీంతో తమ ప్రాణాలనే కాకుండా తనతో ఉన్నవారు ఎటువంటి ఆపదలో ఉన్నా వారి ప్రాణాలను కూడా రక్షించుకునే అవకాశం ఉంటుందని ఇందుకు వారందరికీ అవగా హన ఏర్పడుతుందని భావిస్తున్నారు. స్కూళ్లలోనే కాకుండా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో, రవాణా వ్యవస్థల్లో, ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కార్డియాక్‌పై అవగా హన కల్పిస్తూ కార్యక్రమాలు నిర్వ హంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement