హైదరాబాద్ లో మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా విచ్చేశారు. సినీ స్టార్లు చిరంజీవి, బాలకృష్ణ కూడా పెళ్లికి వచ్చి సందడి చేశారు. చిరంజీవి క్లాసిక్ లుక్ లో కనిపించగా, బాలయ్య కుర్తాలో మెరిశారు. వీరిద్దరూ వధూవరులను ఆశీర్వదించారు. మరోవైపు ఈ పెళ్లికి తెలంగాణకు చెందిన రాజకీయ నేతలు కూడా హాజరయ్యారు. మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వధూవరులను ఆశీర్వదించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..