Friday, April 19, 2024

పునీత్ ఆఖ‌రి చిత్రం ‘జేమ్స్’ టీజ‌ర్ రిలీజ్ – కోటి మందికి పైగా వీక్ష‌ణ‌

దివంగ‌త క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ న‌టించిన ఆఖ‌రి చిత్రం జేమ్స్. కాగా రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా జేమ్స్ స్పెష‌ల్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంద‌ని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. పునీత్‌ చివరి సినిమా జేమ్స్‌ టీజర్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో ప్రియా ఆనంద్‌ హీరోయిన్‌గా, శ్రీకాంత్‌ విలన్‌ గా నటించారు. అలాగే చేతన్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. నేడు రిలీజ్‌ అయిన టీజర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ టీజ‌ర్ రిలీజ్ అయిన మూడు గంట‌ల్లో కోటి మందికి పైగా వీక్షించ‌డం విశేషం. యూట్యూబ్ ని షేక్ చేస్తోందీ టీజ‌ర్. మార్చి 17న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement