Wednesday, May 8, 2024

హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ

జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అమరరాజా సంస్థలను మూసివేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. కాలుష్య నిబంధనలు పాటించని కారణంగా అమర రాజా బ్యాటరీ కంపెనీలను మూసివేయాలని కొద్దిరోజుల కిందట ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై అమరరాజా సంస్థ హైకోర్టులో పిటిషిన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వులను తప్పుబట్టింది.

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా సంస్థకు చిత్తూరు జిల్లాలో పలు చోట్ల బ్యాటరీ తయారీ ప్లాంట్లు ఉన్నాయి. అయితే కొంతకాలంగా అమరరాజా పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణ చర్యలు పాటించడంలేదని ఏపీపీసీబీ భావిస్తోంది. ఈ క్రమంలోనే మూసివేత ఆదేశాలు ఇచ్చింది. దీనిపై అమరరాజా వర్గాలు స్పందిస్తూ, తమది బాధ్యతాయుతమైన సంస్థ అని పేర్కొన్నాయి. ఎన్నో ఏళ్లుగా తమ పరిశ్రమల్లో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నామని వెల్లడించాయి. కాలుష్య నియంత్రణ కోసం భారీగా వెచ్చిస్తున్నామని తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement