Saturday, April 27, 2024

ఏపీలో మళ్లీ 21 వేల కొత్త కేసులు..

ఏపీలో కరోనా వైరస్ రోజు రోజుకూ విస్తరిస్తోంది. రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌ మొదలైన తర్వాత వరుసగా నాలుగో రోజు 20వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 1,10,147 పరీక్షలు నిర్వహించగా.. 21,954 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. 72 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కేసులతో కలిపి ఇప్పటివరకూ రాష్ట్రంలో 12,28,186 మంది వైరస్‌ బారినపడ్డారు. 24 గంటల వ్యవధిలో 10,141 మంది బాధితులు కోలుకోవడంతో కోలుకున్న వారి సంఖ్య 10,37,411 కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,82,329 యాక్టివ్‌ కేసులున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement