Monday, May 6, 2024

గులాబీ గంతలు తీసి కరోనాను కట్టడి చేయండి: షర్మిల

తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇంకెంతమంది ఆక్సిజన్ అందక చనిపోతే కరోనా కంట్రోల్ తప్పిందని భావిస్తారని ప్రశ్నించారు. ఆసుపత్రుల్లో బెడ్లు సరిపోక ఇంకెంత మంది రోడ్డున పడితే కరోనా విలయతాండవం చేస్తోందని అనుకుంటారని నిలదీశారు. ఇంకెంత మంది వ్యాక్సిన్ అందక కోవిడ్ బారిన పడితే కరోనా ఉందని గుర్తిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ఇంకెంత మంది అప్పుల బారిన పడితే రాష్ట్రంలో కరోనా అదుపు తప్పిందనుకుంటారని షర్మిల పేర్కొన్నారు. కరోనా కంట్రోల్ లో ఉందని జబ్బలు చరుచుకోవడం మానుకోవాలని… మీ కళ్లకున్న గులాబీ గంతలు తీసేసి, కరోనాను కట్టడి చేయాలని వ్యాఖ్యానించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి దొరగారూ అంటూ షర్మిల ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement