Friday, April 26, 2024

విప్రో మరో కీలక నిర్ణయం…

విప్రో సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. త‌మ సంస్థ ఉద్యోగుల‌కు హైబ్రిడ్ ప‌ని విధానాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు ఆ సంస్థ ప్ర‌క‌టించింది. ఈ నెల 10 నుంచి హైబ్రిడ్ ప‌ని విధానాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు ఉద్యోగుల‌కు మెయిల్ ద్వారా తెలియ‌జేసింది. హైబ్రిడ్ ప‌ని విధానం ప్ర‌కారం ఉద్యోగులు వారానికి 3 రోజుల పాటు ఆఫీసుకు వ‌చ్చి ప‌నిచేయాల్సి ఉంటుంది. ఈ విధానంలో త‌మ ఉద్యోగులంతా ప్ర‌తి సోమ‌, మంగ‌ళ‌, గురు, శుక్ర‌వారాల్లో క‌నీసం 3 రోజుల పాటు ఆఫీసుకు వ‌చ్చి ప‌నిచేయాల‌ని విప్రో తెలిపింది. ఇప్పటికే రెండేసి ఉద్యోగాలు చేస్తున్న 300మందిని విప్రో తొలగించింది. ఈ నిర్ణ‌యంపై విప్రో ఉద్యోగులు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement