Friday, April 26, 2024

ఏపీలో విద్యార్ధులకు సమ్మర్ హాలీడేస్

ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇంటర్ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లను దాదాపు పూర్తి చేసింది. జూన్ 7 నుంచి టెన్త్ పరీక్షలు కూడా నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మే 1 నుంచి 31వరకు పదో తరగతి విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించింది. అలాగే జూన్ 1 నుంచి 5 వరకు పాఠశాలలకు రిపోర్టు చేయాలని విద్యాశాఖ పేర్కొంది. జూన్ 7 నుంచి పరీక్షల నిర్వహణకు సిద్ధం కావాలని స్పష్టం చేసింది. పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సహకరించాలని టీచర్లకు సూచించింది. సెలవుల్లో విద్యార్థులకు డిజిటల్ మార్గాల ద్వారా.. సందేహాలు తీర్చాల్సిందిగా సూచనలిచ్చింది ఈ మేరకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పదో తరగతి పరీక్షల నిర్వహణకు సిద్ధం కావాల్సిందిగా రీజినల్ డైరెక్టర్లను ఆదేశించింది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement