Saturday, April 27, 2024

Amit Shah: నేడు ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ని సందర్శించనున్న అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. నగర శివార్లలోని ముచ్చింతల్‌లోని చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహంలో ఆయన పాల్గొంటారు. రామానుజాచార్య సమతామూర్తి విగ్రహన్ని సందర్శించనున్నారు. ఇవాళ సాయంత్రం 4.40 గంటలకు శంషాబాద్ విమానాశ్రమానికి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ముచ్చింతల్ లోని శ్రీరామ నగరానికి చేరుకోనున్నారు.

ఆశ్రమంలోని ‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ని సందర్శించిన తర్వాత ఆశ్రమంలో ఏర్పాటు చేసిన 108 దివ్య దేశాలు (దేవాలయాలు) దర్శనం చేసుకుంటారు. అక్కడ యాగశాల పూజల్లో పాల్గొననున్నారు. అనంతరం రాత్రి 8 గంటలకు శంషాబాద్ విమానాశ్రమం నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా వస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేసింది. కాగా, ముచ్చింతల్ లో సమతామూర్తి శ్రీ రామానుచార్యుల 216 అడుగుల విగ్రహాన్ని ఈ నెల 5న ప్రధాని మోదీ ఆవిష్కరించారు. సమతామూర్తి విగ్రహాన్ని దేశ ప్రజలకు అంకితం చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement