Friday, April 19, 2024

భారత్‌-పాక్‌ మ్యాచ్‌ హౌస్‌ఫుల్‌..

టీ20 ప్రపంచకప్‌లో మరోసారి దాయాదులు భారత్‌-పాకిస్థాన్‌ తలపడనున్నాయి. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాక్‌ అక్టోబర్‌ 23న తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ టికెట్లు గంటల వ్యవధిలోనే అమ్ముడైపోయాయి. భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు సంబంధించి అన్ని టికెట్లు అమ్ముడైపోయాయని ఐసీసీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. గ్రూప్‌-2లో భారత్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లు ఉన్నాయి.

కాగా గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో భారత్‌-పాక్‌ తలపడ్డాయి. ప్రపంచకప్‌లో పాక్‌పై ఓటమెరుగని భారతజట్టు తొలిసారి దాయాది చేతిలో ఓటమిపాలైంది. టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో భారతజట్టు ఇప్పటివరకు పాకిస్థాన్‌తో ఆరుసార్లు తలపడగా భారత్‌ జట్టు అత్యధికంగా ఐదుసార్లు విజయం సాధించింది. ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌ మధ్య ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ జరగనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement