Friday, May 24, 2024

అమెరికాలో యాక్సిడెంట్‌.. తెలంగాణ విద్యార్థుల దుర్మరణం

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు విద్యార్థులు చ‌నిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చికాగోలో గురువారం ఉదయం జ‌రిగింది. ఈ యాక్సిడెంట్‌లో హైదరాబాద్‌లోని నిజాంపేటకు చెందిన జేఎన్‌టీయూ ప్రొఫెసర్‌ పద్మజారాణి కుమారుడు వంశీకృష్ణ (23), ఖమ్మంకు చెందిన పవన్‌ స్వర్ణ (23) మృతి చెందారు. ఇదే ఘటనలో కల్యాణ్‌, కార్తీక్‌, శ్రీకాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

వీరు సదరన్ ఇల్లినాయిస్ యూనివర్సిటీ (SIU)లో చదువుతున్నారు. విద్యార్థులంతా కలిసి పిక్నిక్‌కు కారులో వెళ్తున్న సమయంలో మరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు చ‌నిపోగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. చదువు కోసం అమెరికాకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో విషాదం అలుముకున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement