Saturday, June 15, 2024

Alert | రెండు రోజుల పాటు ప‌లు ఎంఎంటీఎస్ రైళ్ల ర‌ద్దు…

హైదరాబాద్ జంట నగరాల్లో ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు అల‌ర్ట్… ఈ నెల 25, 26 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ రైళ్లు, నాలుగు డెమో సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునీకరణ పనులు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిల (ఎఫ్‌వోబీ) నిర్మాణ ప‌నుల‌ నేపథ్యంలో రైళ్ల‌ను రద్దు చేస్తున్న‌ట్టు తెలిపింది.

కాగా, సికింద్రాబాద్‌-ఫలక్‌నుమా, మేడ్చల్‌-సికింద్రాబాద్‌; లింగంపల్లి-మేడ్చల్‌, హైదరాబాద్‌-మేడ్చల్‌ మధ్య సేవలందించే 22 ఎంఎంటీఎస్‌ సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు చీఫ్‌ పీఆర్వో సీహెచ్‌.రాకేశ్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. వీటితో పాటు సిద్దిపేట-సికింద్రాబాద్‌ మధ్య సర్వీసులందించే నాలుగు డెమూ రైళ్ల రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కొన్ని రైళ్లను రెండు రోజుల పాటు, మరికొన్నింటిని ఒక్కరోజు పాటు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

రద్దయిన రైళ్ల వివరాలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement