Wednesday, May 8, 2024

”రింగా రింగా రోసే.. పిల్లా నిన్ను చూసే… ”

‘అథర్వ’ అనే చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్‌, సాంగ్స్‌ ఉన్నాయి అని చిత్ర బృందం అంటోంది. తాజాగా ఈ చిత్రం నుంచి పాటను విడుదల చేశారు. మహేష్‌ రెడ్డి దర్శకుడు. సుభాష్‌ నూతలపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ఐదు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇటీ-వలే ఈ సినిమా నుంచి విడుదలైన టీ-జర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. సంగీత దర్శకుడు శ్రీ చరణ్‌ పాకాల పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ”రింగా రింగా రోసే.. పిల్లా నిన్ను చూసే… ” పాటను చిత్రబృందం విడుదల చేసింది. కిట్టు- విస్సాప్రగడ సాహిత్యం, జావెద్‌ అలీ గాత్రం అందించారు. మాస్టర్‌ రాజ్‌ కృష్ణ నిర్వహించారు.


అనంతరం ఏర్పాటు- చేసిన కార్యక్రమంలో చిత్ర దర్శకుడు మహేష్‌ మాట్లాడుతూ.. టీ-జర్‌లోనే ఇది ఒక ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ అని తెలియజేశాం. హీరో ఫీలింగ్‌ను సినిమాలో ఈ పాటతో చెప్పే ప్రయత్నం చేస్తాడు. శ్రీ చరణ్‌ ఈ పాటలకు అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చాడు. అన్నారు. చిత్ర నిర్మాత సుభాష్‌ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం టీమ్‌ అంతా చాలా కష్టపడ్డాం. సినిమా చాలా బాగా వచ్చింది. అన్నారు.హీరో కార్తీక్‌ మాట్లాడుతూ.. ఈ సిని మాలో అందరూ చాలా బాగా నటించారు. నిర్మాత సుభాష్‌ కథకు ఏం కావాలో అన్నీ సమాకూర్చడమే కాకుండా ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను చాలా చక్కగా నిర్మించారు అని అన్నారు. హీరోయిన్‌ సిమ్రన్‌ చౌదరి మాట్లాడుతూ.. ఇది ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ అయినా ఇందులో చాలా ఏమోషన్స్‌ ఉన్నాయి. అన్నారు.నటులు గగన్‌,కిరణ్‌ మచ్చ, విజయ్‌ రామారాజు, కొరియోగ్రాఫర్‌ బాను మాస్టర్‌, రమణ తదితరులు సినిమా గురించి మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement