Sunday, May 5, 2024

TS | డీజే సౌండ్స్​తో న్యూసెన్స్ చేయొద్దు.. రూల్స్ మీరితే సీజ్ చేస్తాం: సీపీ రంగనాథ్

వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్): పెళ్లి వేడుకల పేరుతో డిజే సౌండ్ సెట్స్, బ్యాండ్ మేళలతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తే చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. ఇక నుండి సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకోవడానికి వెనుకడబోమని అన్నారు. ముఖ్యంగా అర్ధరాత్రి సమయాల్లో ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా డీజే సౌండ్స్‌, బ్యాండ్ మేళాలను ఉపయోగిస్తూ శబ్ద కాలుష్యానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ తేల్చి చెప్పారు.

అర్థరాత్రి వేళల్లో 100 డయల్ ద్వారా ఫిర్యాదుల సంఖ్య పెరిగి పోవడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ ఇష్యూ పై ఫోకస్ చేశారు. డి జే సౌండ్ సెట్లు, బ్యాండ్ వాయిద్యాల నియంత్రణకై, పోలీస్ బాస్ ప్రత్యేక చర్యలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా వరంగల్, హనుమకొండ జిల్లాలోని డి.జె సౌండ్స్, బ్యాండ్ వాయిద్యకారులు, ఆర్కెస్ట్రా బృందాలతో మంగళవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement