Saturday, May 4, 2024

దేశంలో కరోనా కల్లోలం

దేశంలో కరోనా కేసుల పెరుగుదల తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,258 మందికి వైరస్​ సోకగా.. 291 మంది మరణించారు. 30,386 మంది వైరస్​ను కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,19,08,910కి చేరింది. అదే సమయంలో 1,12,95,023 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకు  1,61,240 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 4,52,647 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. ఇక, దేశంలో ఇప్పటివరకు 5 కోట్ల 81 లక్షలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు తెలంగాణలోనూ కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.  ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 495 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,05,804కి చేరింది.  ఇందులో 2,99,878 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 4,241 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1685 కి చేరింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement