Friday, April 26, 2024

ఇండియాలో కొత్తగా 6168 కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రోజు రోజుకు తగ్గుతూ వస్తున్నాయి. కొత్తగా 6168 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,44,42,507కు చేరాయి. ఇందులో 4,38,55,365 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,932 మంది మరణించారు. మరో 59,210 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 9685 మంది కరోనా నుంచి బయటపడగా, 21 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజువారీ రికవరీ రేటు 1.94 శాతంగా ఉందని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement