Thursday, April 25, 2024

AP: గ్యాస్ సిలిండ‌ర్ల లారీకి మంట‌లు.. 100కు పైగా పేలిపోయి భారీ బీభత్సం

300కుపైగా గ్యాస్ సిలిండర్లను మోసుకెళ్తున్న లారీ ఒక్కసారిగా పేలిపోయింది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం దద్దవాడ వద్ద అనంతపురం-గుంటూరు జాతీయ రహదారిపై నిన్న‌ అర్ధరాత్రి ఈ ఘ‌ట‌న జరిగింది. కర్నూలు నుంచి శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడుకు 300కు పైగా భారత్ గ్యాస్ సిలిండర్లతో ఓ లారీ బయలుదేరింది. దద్దవాడ వద్ద క్యాబిన్‌లో మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ మోహన్‌రావు వెంటనే లారీ ఆపి కిందికి దిగాడు. సిలిండర్లు పేలే ప్రమాదం ఉందని గ్రహించి రహదారిపై అటుఇటు వాహనాలను నిలిపివేశారు. ఆ తర్వాత కాసేపటికే లారీలోని సిలిండర్లు పేలడం మొదలైంది.

మరోవైపు, సమాచారం అందుకున్న హైవే పోలీసులు ఘటనా ప్రాంతానికి సమీపంలో ఉన్న దద్దవాడలోని 30 ఇళ్లను ఖాళీ చేయించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శకటం వచ్చినప్పటికీ సిలిండర్లు పెద్ద శబ్దంతో పేలిపోతుండడంతో దగ్గరి వరకు వెళ్లలేకపోయింది. దూరం నుంచే మంటలను ఆపే ప్రయత్నం చేశారు. భారీ శబ్దంతో సిలిండర్లు పేలుతుండడంతో సమీప గ్రామాల్లోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. దాదాపు 100 సిలిండర్లు పేలిపోయిన‌ట్టు తెలుస్తోంది. పోలీసులు, లారీ డ్రైవర్ అప్రమత్తత కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement