Friday, April 26, 2024

తోటి జవాన్లపై కాల్పులు.. నలుగురు మృతి

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలోని మారాయిగూడెం వద్ద లింగంపల్లి బేస్‌ క్యాంప్‌లో సీఆర్‌పీఎఫ్‌ (CRPF) జవాన్ల మధ్య సెలవుల విషయంలో ఘర్షణ తలెత్తింది. దీంతో ఓ జవాన్‌ తోటి జవాన్లపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మరో జవాన్‌ కూడా మరణించారు. మృతులను బీహార్‌కు చెందిన రాజమణి యాదవ్‌, డంజి, పశ్చిమబెంగాల్‌కు చెందిన రాజుమండల్‌గా గుర్తించారు. చికిత్స పొందుతున్న వారిలో మరో జవాను పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement