Sunday, April 28, 2024

Breaking: అజ్మీర్​ వెళ్తున్న బస్సుకు యాక్సిడెంట్​.. నలుగురు మృతి, 45 మందికి తీవ్ర గాయాలు

ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా సమీపంలో ఇవ్వాల (ఆదివారం) తెల్లవారుజామున జరిగిన బస్సు యాక్సిడెంట్​లో నలుగురు చనిపోయారు. ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్‌వేపై ప్రయాణికులను బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 45 మందికి పైగా గాయపడ్డారు. యూపీలోని గోరఖ్‌పూర్ నుంచి రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు బస్సు వెళ్తుండగా తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సైఫాయిలోని పీజీఐ ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement