Tuesday, May 7, 2024

FLASH: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మణుగూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వేగంగా దూసుకొచ్చిన లారీ ఓ బైకును వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను అశ్వాపురం మండలానికి చెందిన ఆసిఫ్‌ పాషా, భీష్మా రెడ్డిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement