Friday, May 17, 2024

Big Breaking : ఫేక్ స‌ర్టిఫికెట్ల వ్య‌వ‌హారంపై పోలీసుల దూకుడు – క‌న్స‌ల్టెన్సీ నిర్వాహ‌కుల అరెస్ట్

న‌కిలీ స‌ర్టిఫికెట్ల వ్య‌వ‌హారంపై కేంద్ర‌, రాష్ట్ర పోలీసులు దూకుడు చూపించారు. హైద‌రాబాద్ లో ప‌లుచోట్ల అమెరికా అధికారులు, కేంద్ర నిఘా వ‌ర్గాలు దాడులు జ‌రిపాయి. కాగా ఫేక్ స‌ర్టిఫికెట్ల‌తో ఇప్ప‌టికే అమెరికాలో సెటిల్ అయ్యారు ప‌లువురు చీట‌ర్స్. హైద‌రాబాద్ లోని ప‌లు క‌న్స‌ల్టెన్సీల్లో యూఎస్ ఎంబ‌సీ,ఢిల్లీ పోలీసుల త‌నిఖీలు చేశారు. న‌కిలీ స‌ర్టిఫికెట్ల‌తో విదేశాల‌కు విద్యార్థులు, ఉద్యోగుల‌ను త‌ర‌లిచిన‌ట్లు గుర్తించారు. దాంతో అమీర్ పేట‌, కూక‌ట్ ప‌ల్లి,బేగంపేట‌,మ‌ల‌క్ పేట‌, దిల్ సుఖ్ న‌గ‌ర్ ప్రాంతాల్లో ప‌లువురు క‌న్స‌ల్టెన్సీ నిర్వాహ‌కుల‌ను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. అదుపులోకి తీసుకున్న వారిని ఢిల్లీ త‌ర‌లించారు అధికారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement