Wednesday, May 1, 2024

Flash: బైకును ఢీకొట్టిన ట్రాక్టర్… ముగ్గురికి తీవ్ర గాయాలు

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగపేట గ్రామం వద్ద ట్రాక్టర్ ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మికుంట మానకొండూరు ప్రధాన రహదారిపై రంగంపేట స్టేజీ వద్ద ఇసుక లోడుతో కరీంనగర్ వైపు వెళ్తున్న ట్రాక్టర్.. మానకొండూర్ నుంచి పచ్చునూరు  వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో కరీంనగర్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులది వీణవంక మండలం మామిడాల పల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement