Saturday, April 27, 2024

పాక్ లో ఘోర బస్సు ప్రమాదం.. 13 మంది మృతి

పాకిస్థాన్ ​లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది మృతిచెందారు. మరో 25 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. హసన్ అబ్దుల్ బుర్హాన్ ప్రాంతంలో ఈ బస్సు ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. రెస్క్యూ సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను, గాయపడిన వారిని హసన్ అబ్దుల్‌ లోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల్లో మహిళ, చిన్నారి ఉన్నట్లు వెల్లడించారు. అధిక వేగం కారణంగా డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement