Tuesday, May 14, 2024

దేశంలో కొత్తగా 1.65 లక్షల కరోనా కేసులు..3 వేల మంది మృతి..

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నది. వరుసగా మూడు రోజు రెండు లక్షలకు దిగువన నమోదయ్యాయి. అయితే, మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తుండగా.. పెద్ద ఎత్తున బాధితులు కోలుకోవడం కాస్త ఊరట కలిగిస్తున్నది. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,65,553 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. మరో వైపు 24 గంటల్లో 3,460 మంది మృత్యువాతపడ్డారు. కొత్తగా 2,76,309 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,78,94,800కు చేరగా.. ఇప్పటి వరకు 2,54,54,320 మంది కోలుకున్నారు. వైరస్‌ బారినపడి మొత్తం 3,25,972 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 21,14,508 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ వివరించింది. వ్యాక్సిన్‌ డ్రైవ్‌లో ఇప్పటి వరకు 21,20,66,614 డోసులు పంపిణీ చేసినట్లు చెప్పింది

Advertisement

తాజా వార్తలు

Advertisement