Sunday, April 28, 2024

లోకేష్ ఒక జోకర్… చంద్రబాబుకు బుర్ర లేదు: మంత్రి కొడాలి

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ లపై మంత్రి కొడాలి నాని సంచనల వ్యాఖ్యలు చేశారు. ఏపీ లో సంక్షేమ కార్యక్రమాలు  చూసి  ఓర్వలేక  విషం కక్కుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఆధికారం చేపట్టి రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడారు. 2014 లోనే  జగన్ ని సీఎం గా ఎన్నుకుంటే  బావుండేది అని జనం భావిస్తున్నారని అన్నారు. 2014లో చంద్రబాబుకు అధికారం ఇచ్చి తప్పు చేశామని కొందరు బాధ పడుతున్నారని పేర్కొన్నారు. ఈ రెండేళ్ల పరిపాలనలో కుల మతాలకి  అతీతంగా జగన్ పాలన పై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. గడిచిన రెండేళ్లలో సంక్షేమ అభివృద్ధి పై వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. లక్ష కోట్లకు పైగా సంక్షేమం అనేక వర్గాలకు దక్కిందని తెలిపారు. ఆరోగ్య శ్రీలో కరోనా చికిత్సను చేర్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రపదేశ్ అని మంత్రి కొడాలి నాని అన్నారు.

కరోనాతో తల్లిదండ్రులు చనిపోయి అనాధలైన పిల్లలకు రూ. 10 లక్షల డిపాజిట్ చేసి సీఎం జగన్ దేశానికి ఆదర్శంగా  నిలిచారని కొనియాడారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక మెడికల్ కాలేజి  వస్తోందన్నారు. 75 ఏళ్ల చరిత్రలో ఇలాంటి  విప్లవాత్మక మార్పులు లేవని, కేవలం రెండేళ్లలోనే ఇది జరిగిందన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం పట్ల జగన్  చిత్తశుద్ధితో  ఉన్నారని చెప్పారు.. మేనిఫెస్టోను పవిత్రంగా భావించిన  సీఎం జగన్… అందులో ఇచ్చిన హామీలన్ని నెర్చవేర్చారని చెప్పారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఇంకా 30 ఏళ్లు జగనే  సీఎం గా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.  

ఎన్టీఆర్ కి భారతరత్న ఆపిన దుర్మార్గుడు చంద్రబాబు అని మంత్రి కొడాలి నాని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. జగన్ పై అవాకులు చెవాకులు పేలిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఏపీలో సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేక పోతున్నారని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు సార్లు చంద్రబాబుని తుక్కు తుక్కుగా ఓడించారన్నారు. జగన్ కూడా చంద్రబాబుని ఓడించడంతో ఇప్పుడు జూమ్ మీటింగ్ లకే పరిమితం అయ్యారని అన్నారు. లోకేష్ ఒక జోకర్…..కనీసం ఎమ్మెల్యే గా కూడా గెలవలేడు అని వ్యాఖ్యానించారు. దొడ్డి దారిన మంత్రి పెదవి వెలగ బెట్టిన సన్నాసి లోకేష్ అని మండిపడ్డారు. మూడు శాఖలకు మంత్రిగా చేసిన లోకేష్ ను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేశారన్నారు. చంద్రబాబు, లోకేష్ లకు బుర్ర పని చేస్తోందా ? అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement