రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నిలువరించడానికి విధించిన లాక్డౌన్ గడువు నేటితో ముగియనుంది. దీంతో లాక్డౌన్ పొడిగింపుపై ప్రభుత్వం నేడు నిర్ణయం తీసుకోనుంది. దీనికోసం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో మంత్రి మండలి సమావేశం కానుంది. ఈ సందర్భంగా లాక్డౌన్ పొడిగింపుపై సీఎం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లాక్డౌన్తో పాటు పలు కీలక అంశాలపై కేబినెట్లో చర్చ జరగనున్నట్లు సమాచారం. అయితే..రాష్ట్రంలో ఇప్పటికే లాక్డౌన్ కఠినంగా అమలువుతోంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని కార్యకలాపాలకు అనుమతిచ్చారు. ఆ తర్వాత అత్యవసర సేవలు మినహా ఎలాంటి వాటికి అనుమతిండంలేదు.
తెలంగాణలో లాక్ డౌన్ పొడగిస్తారా..? మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ మీట్..
Advertisement
తాజా వార్తలు
Advertisement