Monday, April 29, 2024

covid-19: దేశంలో కరోనా మరణమృదంగం.. ఒక్కరోజే 1733 మంది మృతి

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. అయితే మరణాలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 1,61,386 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  క‌రోనాతో దేశవ్యాప్తంగా 1,733 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు కోవిడ్ తో మృతి చెందిన వారి సంఖ్య 4,97,975కు చేరింది.

గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 2,81,109 మంది కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య‌ 3,95,11,307కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 16,21,603 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 9.26 శాతంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 167.29 కోట్ల డోసుల‌ వ్యాక్సిన్లు అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement