Sunday, May 5, 2024

నలుగురిని ప్రేమించిన యువతి.. లక్కీడ్రాలో ఒక్కరితో పెళ్లి

ఉత్తరప్రదేశ్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. అంబేద్కర్ నగర్‌లోని అజీంనగర్‌కు చెందిన ఓ యువతి నలుగురు యువకులను ప్రేమించింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ నలుగురు యువకులతో కలిసి యువతి ఇల్లు వదిలి వెళ్లిపోయింది. వీరంతా వారి బంధువుల ఇళ్లలో తలదాచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించారు. కానీ ఊరి పెద్దలు పోలీస్ కేసు పెట్టవద్దని.. పంచాయతీలో ఈ సమస్య పరిష్కరించుకుందాం అని సలహా ఇచ్చారు. దీంతో పలుమార్లు చర్చలు జరిపిన తర్వాత సదరు యువతికి నలుగురు యువకుల్లో ఒకరిని ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించారు. ఈ ఛాయిస్ యువతికే వదిలేశారు. కానీ ఆ అమ్మాయి తన వరుడిని ఎంచుకోలేకపోయింది. దీంతో ఊరి పెద్దలు యువకుల పేర్లను చీటీలలో రాసి లక్కీడ్రా నిర్వహించారు. ఓ చిన్నారితో చీటీ తీయించగా ఆ చీటీలో వచ్చిన పేరున్న యువకుడితోనే త్వరలో యువతికి వివాహం చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement