Tuesday, April 30, 2024

వాషింగ్టన్‌ సుందర్‌కు మళ్లీ గాయం.. జింబాబ్వే టూర్‌కు దూరం

టీమిండియాలో స్పిన్‌ అల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌కు మళ్లి గాయమైంది. అతని రీ ఎంట్రీ మరింత ఆలస్యం అయ్యేలాకనిపిస్తుంది. ఐపిఎల్‌లో గాయాయలపాలు అయిన ఆయనకు మరోసారి గాయమైంది. జిబాబ్వే టూర్‌కు ఎంపికైన జట్టు సభ్యుడు కూడా ఆయన. ఈ నేపథ్యంలో మరోసారి గాయాలపాలు కావడం టీమిండియాకు కొంత బాధకరమే. కౌంటీ క్రికెట్‌లో భాగంగా మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తుండగా ఎడమ భుజానికి దెబ్బతగిలింది.

దాంతో ఈ నెల 18 నుంచి జరిగే జింబాబ్వే టూర్‌కు అతను దూరం కానున్నాడు. లోకేష్‌ రాహుల్‌ కెస్టెన్సీలోని ఇండియా శనివారం ఉదయం జింబాబ్వే వెళ్లింది. సుందర్‌ యూకే నుంచి నేరుగా హరారే చేరుకోవాల్సి ఉంది. కానీ గాయానికి చికిత్స కోసం అతను యూకేలోనే ఉండిపోయాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement