Tuesday, April 30, 2024

టీ మిండియాకు కోచ్‌గా వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌.. ప్ర‌క‌టించిన బీసీసీఐ

నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సిఏ) చీఫ్‌ వివిఎస్‌ లక్ష్మణ్‌ మరోసారి టీ మిండియాకు కోచ్‌గా వ్యవహరించబోతున్నాడు. మూడు వన్డేల సిరీస్‌ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లే రాహుల్‌ కెప్టెన్సీలోని జట్టుకు లక్ష్మణ్‌ తాత్కాలిక కోచ్‌గా ఉంటాడని బిసిసిఐ సెక్రటరీ జైషా ప్రకటించారు.హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ప్లేస్‌లో వివిఎస్‌ లక్ష్మణ్‌ జట్టుతో కల్సి జింబాబ్వే వెళ్లాడు. ఈ సిరీస్‌ ఈ నెల 18 నుంచి 22 వరకు జరుగుతుంది. ఈ నెల 27న యూఏఈలో ఆసియాకప్‌ మొదలవుతుంది.

ఈ రెండు టోర్నీల మధ్య తక్కువ గ్యాప్‌ ఉండటంతో జింబాబ్వే వెళ్లే టీమ్‌కు వీవిఎస్‌ ఇంచార్జ్‌గా వ్యవహరిస్తాడని షా చెప్పారు. ద్రవిడ్‌ ఆసియాకప్‌ టీమ్‌తో కలిసి దుబాయ్‌ వెళ్లనున్నాడు. గత నెలలో టీమిండియా.. ఇంగ్లండ్‌ జట్టుతో టెస్ట్‌ సిరీస్‌కు సన్నద్దం అవుతుండగా… ఐర్లాండ్‌తో టీ 20 సిరీస్‌ ఆడిన హార్థిక్‌ పాండ్యా కెప్టెన్సీలోని మరో టీమ్‌కు వివిఎస్‌ కోచ్‌గా పని చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement