Wednesday, May 15, 2024

లెక్క సరిచేస్తారా? రోహిత్ ఆడతాడా?

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు ఇంగ్లాండ్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ తలపడనుంది. తొలి టీ20లో దారుణ పరాజయాన్ని చవిచూసిన కోహ్లీ సేన ఈ మ్యాచ్‌లో గెలిచి లెక్కసరిచేస్తారో లేదో వేచి చూడాలి. తొలి మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ విఫలం జట్టును దెబ్బతీసింది. ధావన్, రాహుల్ ఓపెనింగ్ జోడీ రాణించకపోవడంతో ఈ మ్యాచ్‌లో రోహిత్‌ను బరిలోకి దింపాలని అభిమానులు కోరుకుంటున్నారు. అద్భుత ఫామ్‌లో ఉన్న అతడికి విశ్రాంతి ఇవ్వడం సబబు కాదని విశ్లేషకులు సూచిస్తున్నారు. దీంతో కెప్టెన్ కోహ్లీ ఏ నిర్ణయం తీసుకుంటాడో ఆసక్తిగా మారింది. అటు పిచ్ తీరు దృష్ట్యా మూడో స్పిన్నర్‌కు బదులు మరో పేసర్‌ను ఈ మ్యాచ్‌లో ఆడించే అవకాశం ఉంది.

నేడు వన్డే జట్టు ఎంపిక
ఐదు టీ20ల సిరీస్ తర్వాత ఇంగ్లీష్ జట్టుతో జరగబోయే వన్డే సిరీస్‌కు నేడు భారత జట్టును ప్రకటించే అవకాశముందని బీసీసీఐ అధికారి తెలిపారు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విశ్రాంతి కోరుకోలేదని చెప్పారు. జట్టులో ఆశ్చర్యకర మార్పులేమీ ఉండకపోవచ్చన్నారు. ఇక విజయ్ హజారే ట్రోఫీలో పరుగులు వరద పారిస్తున్న పృథ్వీ షా, పడిక్కల్ మరికొన్ని రోజులు నీరిక్షించక తప్పదన్నారు. కాగా మార్చి 23 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement